Share News

AP Elections 2024: కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే కోనసీమలో అల్లర్లు సృష్టించారు: పవన్ కళ్యాణ్

ABN , Publish Date - Apr 28 , 2024 | 09:47 PM

కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే వైసీపీ (YSRCP) నేతలు కోనసీమలో అల్లర్లు సృష్టించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో "వారాహి విజయభేరి" భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

AP Elections 2024: కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే కోనసీమలో అల్లర్లు సృష్టించారు:  పవన్ కళ్యాణ్
Pawan Kalyan

కాకినాడ: కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే వైసీపీ (YSRCP) నేతలు కోనసీమలో అల్లర్లు సృష్టించారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో "వారాహి విజయభేరి" భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ రెడ్డిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిర్లంపూడి సభ ఆంధ్రప్రదేశ్ దశ దిశను మార్చే సభ అవుతుందని తెలిపారు. ఏ నాయకుడైనా సరే అన్ని కులాలను కలుపుకుని పోవాలని చెప్పారు. చేతుల్లో వెలిగించి ఇచ్చే హారతి ఇస్తారని.. ఆ జ్యోతి జగన్ దుర్మార్గం పోవడానికి నాంది పలకాలని తెలిపారు.


Sharmila: సీఎం జగన్.. లాయర్ పొన్నవోలు మధ్య క్విడ్ ప్రోకో

పేదలు ఇల్లు కట్టుకునేందుకు కూడా ఈ ప్రభుత్వం అనుమతి ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో యువతకు ఉపాధి ఉండదన్నారు. కానీ వైసీపీ నేతలు చేసే కబ్జాలకు, దోపిడీలకు అనుమతులు ఉంటాయన్నారు. సినిమాల్లో మార్పుకు మూడు గంటల సమయం పడుతుంది.. కానీ నిజ జీవితంలో మార్పు కావాలంటే దశాబ్ద కాలంగా ప్రయత్నించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.చిన్న పిల్లలకు ఇచ్చే చిక్కిల్లో కూడా 65 కోట్ల రూపాయలు జగన్ దోచేశారని విరుచుకుపడ్డారు. జగన్ సారా వ్యాపారి, రక్త వ్యాపారి అని ఆరోపించారు. వైసీపీకి ఈ ఎన్నికల్లో ఎందుకు ఓట్లు వేయాలో ఎస్సీ సామాజిక వర్గం ఆ వర్గం వైసీపీ నేతలను నిలదీయాలన్నారు.కాపులకు రిజర్వేషన్లకు ఒప్పుకొని వ్యక్తితో వైసీపీ కాపు ఎమ్మెల్యేలు కొనసాగుతున్నారని చెప్పుకొచ్చారు.


AP Elections: నీ అభిమానానికి ఫిదా.. చంద్రబాబు కోసం ఈయన ఏం చేశాడంటే..

వైసీపీ అధికారంలోకి వస్తే దున్నని భూమిని, ఇళ్లను సైతం జగన్ సొంతం చేసుకుంటారని ఆరోపించారు. పిఠాపురంలో మద్యం ఏరులై పారుతోందని మండిపడ్డారు.పోలీసులకు సలెండర్ లీవ్స్ కింద 750 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. సీపీఎస్ కూడా కూటమి అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడి మేనిఫెస్టోలో పెట్టిస్తానని హామీ ఇచ్చారు.కాపు రిజర్వేషన్ల ఉద్యమం వైసీపీ కనుసన్నల్లో జరిగిందని ఆరోపించారు. రిజర్వేషన్లు రావని తెలిసిన వైసీపీ నేతలు కావాలనే ఎగదోసి రైలును తగలబెట్టించారని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి

AP Elections 2024: ఏపీ రాజకీయాలపై జయప్రద ఇంట్రస్టింగ్ కామెంట్స్..

AP Elections 2024: ఓటు ఎవరికి వేశామో తెలుసుకోవచ్చు.. రండి ఇలా చెక్ చేసుకోండి!!

Read Latest Andhra pradesh News or Telugu News

Updated Date - Apr 28 , 2024 | 09:53 PM