Home » Andhra Pradesh » West Godavari
ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మద్యం అమ్మకాలపై కట్టడి మొదలైంది. ఎవరి ఆదేశాల మేరకు చేస్తున్నారో వెల్లడించకుండానే కోటా పూర్తయిందంటూ మద్యం దుకాణాలను నిర్దిష్ఠ సమయం కంటే కొన్ని గంటలకు ముందే మూస్తున్నారు. ఇంతకుముందు ఎడాపెడా మద్యం అమ్మకాలు సాగేవి.
భర్త మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి మొదటి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి అంత్యక్రియలకు సిద్ధం చేస్తున్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న ఘటన ముదినేపల్లి మండలం గురజ గ్రామంలో జరిగింది.
కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ఓటర్లు మద్దతివ్వాలని, గ్రామాల్లో టీడీపీ హయాంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో సీసీ రహదారులు వేశామని జనసేన ఉంగుటూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు పిలుపు నిచ్చారు.
వైసీపీ విష రాజకీయ పరిస్థితుల నుంచి రాష్ర్టాన్ని బయటకు తీసుకొచ్చి ఆరోగ్యవంతమైన సమాజం నెలకొల్పడం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడిందని ఏలూరు కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య(చంటి) అన్నారు.
ఏలూరు జిల్లాలో ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 140 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా వీటిలో వివిఽధ కారణాలతో 30 తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 110 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నాయి.
వైఎస్ఆర్ కలలు కన్న జలయజ్ఞం ఇక్కడ జరగలేదు. లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించే చింతలపూడి ఎత్తిపోతలకు అతీగతీ లేదు. ఈ ఐదేళ్లలో కనీసం తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదు. జగన పాలనలో ఇలా అంతటా నిర్లక్ష్యమే జరిగింది’ అని పీసీసీ చీఫ్ షర్మిల విరుచుపడ్డారు
జల్లేరు వాగులోకి చేపల వేట చూసేందుకు సరదాగా వెళ్లిన ముగ్గురు మృత్యువాత పడ్డారు.
వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భానుడి ప్రతా పానికి పార్టీ నాయకులు, కేడర్ అల్లాడిపోతున్నారు.
ఎన్నికల నేపథ్యంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ జాతీయ, రాష్ట్రీయ రహదారులపై తనిఖీలు నిర్వ హించారు. నాటుసారా, నగదు, మద్యం, గంజాయి రవాణా జరుగకుండా పటి ష్టమైన చర్యలు చేపట్టినట్టు ఎస్పీ ప్రశాంతి తెలిపారు.
ఉంగుటూరు నియోజకవర్గంలో సీఎం హామీలకు దిక్కులేదు. ప్రతిపక్ష హోదాలో జగన్ పాదయాత్ర నియోజకవర్గంలో హామీల టూర్గా సాగింది తప్ప ఏమాత్రం ప్రయోజనం చేకూర్చలేదు.