ఆగ్రో ఫారెస్ట్రీ నర్సరీని పరిశీలించిన అధికారుల బృందం
ABN , First Publish Date - 2022-05-14T04:31:06+05:30 IST
జేకే, ఎస్పీఎం ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న ఆగ్రో ఫారెస్ట్రీ నర్సరీని శుక్రవారం రాష్ట్ర ఉద్యానశాఖ డిప్యూటీడైరెక్టర్ విజయప్రసాద్తో పాటు అధికారులబృందం పరిశీలించింది.
కాగజ్నగర్, మే 13: జేకే, ఎస్పీఎం ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న ఆగ్రో ఫారెస్ట్రీ నర్సరీని శుక్రవారం రాష్ట్ర ఉద్యానశాఖ డిప్యూటీడైరెక్టర్ విజయప్రసాద్తో పాటు అధికారులబృందం పరిశీలించింది. ఈ నర్సరీలో పెంచుతున్న మొక్కలను, అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో చేపడుతున్న పనుల తీరుతెన్నులను ప్లాంటేషన్శాస్త్రవేత్త కన్నన్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిప్యూటీడైరెక్టర్ విజయప్రసాద్ మాట్లా డుతూ ఉద్యానవనశాఖ నిర్వహిస్తున్న నర్సరీల్లో బార్డర్ ప్లాంటేషన్ కోసం కాసోరినా మొక్కలను పెం చాలన్నారు. ఈ మొక్కలతో రైతులకు మరింత ఆదా యం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ యాదగిరి, సువర్ణ, అహ్మద్, వివిధ ఉద్యాన అధికారులు పట్టుపరిశ్రమ అధికారి ఎంఏ అబ్దుల్ నదీం ఖుద్దీసి, సిబ్బంది పాల్గొన్నారు.