రాజమండ్రి రైల్వేస్టేషన్‌ వద్ద సీపీఐ నేతల అరెస్ట్

ABN , First Publish Date - 2022-05-09T13:47:00+05:30 IST

రాజమండ్రి రైల్వేస్టేషన్ వద్ద సీపీఐ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

రాజమండ్రి రైల్వేస్టేషన్‌ వద్ద సీపీఐ నేతల అరెస్ట్

రాజమండ్రి: రాజమండ్రి రైల్వేస్టేషన్ వద్ద సీపీఐ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. చలో అమరావతికి బయలుదేరుతున్న నేతలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అధిక ధరలపై నేడు ఛలో అమరావతి, సచివాలయం ముట్టడికి సీపీఐ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సి.పి.ఐ జిల్లా కార్యదర్శి మధు, నగర కార్యదర్శి నల్లా రామారావు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. 

Read more