భజగోవింద రసాన్వేషణ

ABN , First Publish Date - 2022-05-13T05:30:00+05:30 IST

భారతీయ ఆధ్యాత్మిక లోతును.. సౌరభాలను ప్రపంచానికి తెలియ చెప్పిన మహోన్నతుడు శ్రీ ఆది శంకరాచార్యులు.

భజగోవింద రసాన్వేషణ

భారతీయ ఆధ్యాత్మిక లోతును.. సౌరభాలను ప్రపంచానికి తెలియ చెప్పిన మహోన్నతుడు శ్రీ ఆది శంకరాచార్యులు. పండితులు, పామరులు, సామాన్యులు- ఇలా మన సమాజంలో ఉన్న వివిధ వర్గాల ప్రజల కోసం ఆయన రాసిన 114 రచనలు మనకు లభ్యమవుతున్నాయి. ‘నిర్వాణ షట్కమ్‌’, ‘కౌపీన పంచకం’ వంటి శుద్ధ వేదాంతాన్ని బోధించేవైనా.. ‘సౌందర్యలహరి’, ‘కనకధారాస్తవము’, ‘భజగోవిందం’ వంటి స్తోత్రాలైనా ఒక సామాన్యమైన వ్యక్తి ఈ ప్రపంచంలో ప్రయాణించాల్సిన మార్గాన్ని సూచిస్తాయి. వీటిన్నింటిలోను అత్యంత ప్రచారంలో ఉన్న భజగోవింద స్తోత్రం. వేదాలు, ఉపనిషత్తుల్లో ఉన్న సారమంతా మనం దీనిలో చూడవచ్చు. కేవలం భక్తిని మాత్రమే కాకుండా.. మన జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలనే విషయాన్ని కూడా ఈ స్తోత్రం చెబుతుంది. దీనిని ప్రముఖ రచయిత శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘భజగోవిందం’ పేరిట తెలుగులో వ్యాఖ్యానం రాశారు. ఈ వ్యాఖ్యానం మూలానికి కేవలం అనువాదం మాత్రమే కాదు. రచయితకు జీవితం పట్ల ఉన్న అభిప్రాయ మాలిక కూడా. భజగోవింద  స్తోత్రం అసలు అర్ధాన్ని తెలుసుకోవాలనుకొనేవారికి ఈ పుస్తకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 

భజగోవిందం

మల్లాది వెంకట కృష్ణమూర్తి

ప్రిజమ్‌ ప్రచురణ,

 ప్రతులకు: 040 - 27612928

Read more