టీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే అన్ని వర్గాల అభివృద్ధి
ABN , First Publish Date - 2022-05-14T06:53:51+05:30 IST
టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు.
కుంటాల, మే 13 : టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రం కుంటాలలోని ఓ శుభకార్యానికి హాజరై అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్పటి నుంచి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ర్టాన్ని అభివృద్ధి పతంలో తీసు కెళ్లడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టనుందని, టీఆర్ఎస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూడా అధికారంలో ఉంటుందని ప్రజలు ఆకాక్షిస్తున్నారన్నారు. పేదబడుగు, బలహీనుల వారి అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. రైతులకు గతంలో ఏ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. వరి కొను గోలులో కూడా ముఖ్యమంత్రి వెనుకడుగేయలేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధరను అందిస్తూ రబీలో సాగుచేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగు తుందన్నారు. ఆయన వెంట సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షులు ప్రవీణ్, నాయకులు రఘు, రాముల, మహిపాల్, వినోద్, ఉప సర్పంచ్ రమేశ్లు ఉన్నారు.