IPL 2022: టాస్ గెలిచి ముంబైకి బ్యాటింగ్ అప్పగించిన గుజరాత్
ABN , First Publish Date - 2022-05-07T00:41:12+05:30 IST
వరుసగా 8 మ్యాచుల్లో ఓడి 9వ మ్యాచ్లో గెలిచి ఖాతా తెరిచిన ముంబై ఇండియన్స్ మరోమారు తన అదృష్టాన్ని
ముంబై: వరుసగా 8 మ్యాచుల్లో ఓడి 9వ మ్యాచ్లో గెలిచి ఖాతా తెరిచిన ముంబై ఇండియన్స్ మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి రేసు నుంచి తప్పుకున్న రోహిత్ సేన.. అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్తో పోటీకి సిద్ధమైంది. ఇప్పటికే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు చేరుకున్న గుజరాత్ ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా పాయింట్లను పెంచుకోవాలని చూస్తోంది.
మరోవైపు, ఇప్పటికే ఘోర వైఫల్యాలతో అపఖ్యాతి మూటకట్టుకున్న ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా పరాజయాల సంఖ్యను తగ్గించుకోవాలని చూస్తోంది. ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియంలో మరికాసేపట్లో జరగనున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్.. ముంబైని బ్యాటింగ్కు ఆహ్వానించింది.