K.A.PAUL: త్వరలో తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తా
ABN , First Publish Date - 2022-05-07T23:22:51+05:30 IST
త్వరలో Telangana వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో తన పర్యటన ఉంటుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు..
హైదరాబాద్: త్వరలో Telangana వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో తన పర్యటన ఉంటుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (K.A.PAUL) అన్నారు. సిద్దిపేట జిల్లా జక్కాపూర్ పర్యటనలో ఉన్న ఆయనపై టీఆర్ఎస్ (TRS) కార్యకర్త దాడి చేశారు. ఈ ఘటనపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు, పోలీసుల వ్యవహార శైలీపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఏకంగా గవర్నర్ మీద కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం దాడి చేసిందని చెప్పారు. ఆమెను మహిళ అని చూడకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందన్నారు. నా మీద దాడి చేసిన వారిని వదిలేసి తనను గృహ నిర్బంధం చేశారని మండిపడ్డారు. సిరిసిల్ల ఎస్పీ పై గవర్నర్ కు వివరిస్తానని చెప్పారు. Governorతో భేటీ తరువాత తన కార్యాచరణ ఉంటుందని కేఏ పాల్ తెలిపారు.