-
-
Home » Andhra Pradesh » MK Meena as state CEO-NGTS-AndhraPradesh
-
ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా ఎంకే మీనా నియామకం
ABN , First Publish Date - 2022-05-14T08:53:14+05:30 IST
ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా ఎంకే మీనా నియామకం
విజయానంద్ స్థానంలో నియామకం
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు
అమరావతి: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో)గా సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖేశ్ కుమార్ మీనా నియమితులయ్యారు. ప్రస్తుత సీఈవో విజయానంద్ స్థానంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆయన్ను నియమించింది. శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై ఆదేశాలు జారీ చేసింది. ముఖేశ్ కుమార్ మీనా నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఆయన ప్రస్తుతం వాణిజ్య పన్నులు, చేనేత, జౌళి, ఆహార పరిశ్రమల శాఖల కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గతంలో రాజ్భవన్ కార్యదర్శిగా పనిచేశారు.