-
-
Home » Andhra Pradesh » Notices will also be given to 1 Chandrababu in Land Pooling Case Minister Kv Nageshwara Rao-MRGS-AndhraPradesh
-
Land పూలింగ్ Caseలో A1 Chandrababuకు కూడా నోటీసులు ఇస్తారు: Minister Kv నాగేశ్వర రావు
ABN , First Publish Date - 2022-05-10T21:55:45+05:30 IST
Land పూలింగ్ Caseలో A1 Chandrababuకు కూడా నోటీసులు ఇస్తారు: Minister Kv నాగేశ్వర రావు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాడుపై YCP Minister Kv నాగేశ్వర రావు విమర్శలు గుప్పించారు. లాండ్ పూలింగ్ కేసులో ఏ1గా ఉన్న చంద్రబాబుకు కూడా నోటీసులు ఇస్తారని, చట్టం తమ పని తానూ చేసుకుపోతోందని చెప్పారు. తప్పు చేస్తే అరెస్ట్ చేయడం తప్పా, గతంలో అధికారంలో ఉన్నామని అవినీతి అక్రమాలకు పాల్పడితే ఇప్పుడు కేసులు పెట్టడం తప్పా అని మంత్రి కేవీ ప్రశ్నించారు. అరెస్టుల వెనుక రాజకీయ కక్ష సాధింపులు లేవని, తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారని.. చట్టం తనపని తాను చేసుకుపోతుందని Andhra Pradesh Minister Kv నాగేశ్వర రావు స్పష్టం చేశారు.
అందుకు ముందు ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ అరెస్టుపై మంత్రి కేవీ నాగేశ్వర రావు స్పందించారు. పేపర్ లీక్ విషయంలో నారాయణను అరెస్ట్ చేశారని, Rankings కోసం నారాయణ దుర్మార్గంగా వ్యవహరించారని Minister Kv నాగేశ్వర రావు ఆరోపించారు. ఎంతటి వాళ్లనయినా వదలరని...తప్పు చేసిన వాళ్లను అరెస్ట్ చేస్తారని చెప్పారు. నారాయణ మంత్రిగా ఉన్నపుడు పేపర్ లీక్ జరిగిందో లేదో తనకు తెలీదని మంత్రి కేవీ తెలిపారు.