-
-
Home » Andhra Pradesh » One chance for Jagan-MRGS-AndhraPradesh
-
Jaganకు ఒక్క చాన్సే.. చివరి చాన్స్: పయ్యావుల
ABN , First Publish Date - 2022-05-13T01:52:56+05:30 IST
ఎన్నికలకు ముందు వైఎస్ జగన్కు ఒక్కసారి చాన్స్ ఇద్దామని భావించి ప్రజలు ఓట్లు వేశారని, ఆ ఒక్క చాన్సే చివరి చాన్స్గా మిగిల్చేందుకు ప్రజలు సమాయత్తమయ్యారని ఉరవకొండ
అనంతపురం: ఎన్నికలకు ముందు వైఎస్ జగన్కు ఒక్కసారి చాన్స్ ఇద్దామని భావించి ప్రజలు ఓట్లు వేశారని, ఆ ఒక్క చాన్సే చివరి చాన్స్గా మిగిల్చేందుకు ప్రజలు సమాయత్తమయ్యారని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక పేద, మధ్య తరగతి ప్రజలపై భారీగా పన్నులు మోపారని విమర్శించారు. సామాన్య ప్రజల జీవితాలతో జగన్ (Jagan) సర్కారు ఆటలాడుతోందని మండిపడ్డారు. చెత్త పన్నులు, కరెంటు చార్జీల పెంపు, భగ్గుమంటున్న నిత్యావసర ధరలతో ప్రజల జేబులు గుల్లవుతున్నాయని అన్నారు. ఆర్థిక భారంతో ప్రజలు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి ఆధారంగా పంటలు పండించే భూములకు నీటి తీరువ కట్టాలని ప్రభుత్వం హెచ్చరిస్తుండటం దారుణమని పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) దుయ్యబట్టారు.