Rahul Gandhiకి ప్రగతి భవన్ నుంచే స్ర్కిప్ట్: బండి సంజయ్
ABN , First Publish Date - 2022-05-08T00:18:32+05:30 IST
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ (Rahul Gandhi) వరంగల్లో మాట్లాడిన ప్రసంగం స్ర్కిప్టు అంతా ప్రగతి భవన్ (Pragati Bhavan) నుంచే వచ్చింది.
మహబూబ్నగర్: ‘‘కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ (Rahul Gandhi) వరంగల్లో మాట్లాడిన ప్రసంగం స్ర్కిప్టు అంతా ప్రగతి భవన్ (Pragati Bhavan) నుంచే వచ్చింది. అందుకే ఆయన ప్రసంగంలో ఎక్కడా సీఎం కేసీఆర్ అన్న పదమే ఉచ్చరించలేదు.’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) ఆరోపించారు. బీజేపీ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ స్ట్రాటజీ ప్రకారం వ్యవహరిస్తూ బీజేపీపై ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని నిర్ణయించుకున్నాయని, మాటాముచ్చట అయిపోయిందని, ఇక పెళ్లిమాత్రమే మిగిలిందని అన్నారు. 31 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ సీట్లకు కాంగ్రెస్ పోటీ చేసేందుకు ఒప్పందం కుదిరిందని, ఈ విషయాన్ని తాను, మీడియా బయటపెట్టామని తెలిపారు. ప్రజల్లో ఈ పొత్తుపై వ్యతిరేకత రావడంతో మళ్లీ కాకమ్మకబుర్లు చెబుతున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు.