పోరాటాల ద్వారానే రాజ్యాధికారం సాధ్యం
ABN , First Publish Date - 2022-05-12T04:05:24+05:30 IST
పోరాటాల ఫలితంగానే రాజ్యాధికారం సిద్ధిస్తుందని ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్గౌడ్ అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భనవంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ పార్టీ సదస్సులో ఆయన మాట్లాడారు.
-ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్గౌడ్
కాగజ్నగర్ టౌన్, మే 11: పోరాటాల ఫలితంగానే రాజ్యాధికారం సిద్ధిస్తుందని ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు తీగల ప్రదీప్గౌడ్ అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భనవంలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ పార్టీ సదస్సులో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అధికంగా ఉన్నప్పటికీ 10శాతం కూడా లేని అగ్రవర్ణాలు పాలిస్తున్నాయన్నారు. ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందక్రిష్ణ మాదిగ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే, అంబే ద్కర్ ఆశయాల సాధనకు కృషి చేసి విజయం సాధించినట్లు గుర్తు చేశారు. జాతీయ ఉపాధ్యక్షుడు రజీ హైదర్ మాట్లాడుతూ ఎంఎస్పీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో జాతీయ ఉపాధ్యక్షుడు కేశవరావు మాదిగ, వీహెచ్పీఎస్ జిల్లా కోఆర్డినేటర్ సత్యనారాయణ, నాయకులు పాల్గొన్నారు.