పనులను వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-05-12T04:19:33+05:30 IST

జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరీ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏసీసీ, న్యూగర్మిళ్లలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను కలెక్టర్‌ సందర్శించి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు

పనులను వేగవంతం చేయాలి
పాఠశాలలో అధికారులకు సూచనలు ఇస్తున్న కలెక్టర్‌ భారతి హోళికేరీ

- కలెక్టర్‌ భారతి హోళికేరీ

ఏసీసీ, మే 11: జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరీ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏసీసీ, న్యూగర్మిళ్లలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను కలెక్టర్‌ సందర్శించి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. అవసరమైన పనులను గుర్తించి నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈ శ్రీనివాస్‌, ఏఈలు స్వామి, అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more