పనులను వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-05-12T04:19:33+05:30 IST
జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ భారతి హోళికేరీ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏసీసీ, న్యూగర్మిళ్లలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను కలెక్టర్ సందర్శించి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు
- కలెక్టర్ భారతి హోళికేరీ
ఏసీసీ, మే 11: జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ భారతి హోళికేరీ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏసీసీ, న్యూగర్మిళ్లలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను కలెక్టర్ సందర్శించి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. అవసరమైన పనులను గుర్తించి నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఈ శ్రీనివాస్, ఏఈలు స్వామి, అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.