కిక్‌బాక్సింగ్‌లో ప్రతిభ చూపిన విద్యార్థినికి సన్మానం

ABN , First Publish Date - 2022-05-13T06:41:29+05:30 IST

రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్‌ 46 కేజీల విభాగంలో బంగారు పథకం సాధించిన గాగ్లేకర్‌ మనీషాను గు రువారం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు సన్మానించారు.

కిక్‌బాక్సింగ్‌లో ప్రతిభ చూపిన విద్యార్థినికి సన్మానం
మానీషాను సన్మానిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు

తానూర్‌, మే 12 : రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్‌ 46 కేజీల విభాగంలో బంగారు పథకం సాధించిన గాగ్లేకర్‌ మనీషాను గు రువారం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు సన్మానించారు. మండలంలోని బెల్‌తరోడా గ్రామా నికి చెందిన గార్లెకర్‌ మనీషా భైంసాలోని కేజీబీవో పాఠశాలలో విధ్యనభ్యసిస్తుంది. అక్కడే కిక్‌ బాక్సింగ్‌ శిక్షణ పొందింది. రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కిక్‌ బాక్సింగ్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచి జూన్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననుంది. ఆమెను గురువారం జడ్పీవైస్‌ చైర్మన్‌ సాగరాబాయి రాజన్న, ఆత్మచైర్మన్‌ పోతారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షులు చంద్రకాంత్‌ యాదవ్‌, ఎంపీడీవో గోపాలకృష్ణరెడ్డి, తహసీల్దార్‌ వెంకట రమణ, సర్పంచ్‌ విఠల్‌, కోఆప్షన్‌ సభ్యులు గోవింద్‌పటేల్‌, సన్మానించి అభినందించారు. జాతీయస్థాయిలో పోటీల్లో ప్రతిభ కనబర్చాలని ఆకాక్షించారు.

Read more