Pilgrims బస్సును ఢీకొన్న ట్రక్కు: ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
ABN , First Publish Date - 2022-05-04T22:43:42+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. Agra-Lucknow Expresswayపై యాత్రికులతో..
ఇటావా: ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. Agra-Lucknow Expresswayపై యాత్రికులతో వెళ్తున్న బస్సును కంటైనర్ ట్రక్కు ఢీకొనడంతో బస్సులోని ఇద్దరు దంపతులు దుర్మరణం పాలయ్యారు. మరో అరడజను మంది ప్రయాణికులు గాయపడ్డారు. మృతులను విఠల్ మారుతి (65), సులోచన (60)గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఢిల్లీ నుంచి వారణాసికి యాత్రికులతో బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు ఏఎస్పీ జై ప్రకాష్ సింగ్ తెలిపారు. క్షతగాత్రులను స్థానిక సైఫై ఆసుపత్రికి తరలించామని, కొందరిని ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారని చెప్పారు. బస్సులో సుమారు 50 మంది ప్రయాణిస్తున్నట్టు ఏఎస్పీ తెలిపారు.