విజయసాయి, బండ్ల గణేష్ మధ్య Tweet war

ABN , First Publish Date - 2022-05-08T19:55:26+05:30 IST

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఇప్పుడు ఏపీ రాజకీయల్లో హాట్ టాపిక్‌గా మారింది.

విజయసాయి, బండ్ల గణేష్ మధ్య Tweet war

Hyderabad: రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఇప్పుడు ఏపీ రాజకీయల్లో హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, సినీనటుడు బండ్ల గణేష్ మధ్య మరోసారి మాటల యుద్ధానికి తెరతీసింది. ఎల్లో మీడియా ముఖ్యులు తమ వ్యాపార విబేధాలను పక్కనపెట్టి ఎకమయ్యారంటూ ట్వీట్ చేసిన విజయసాయికి బండ్ల గణేష్ కౌంటరిచ్చారు.


రాహుల్ గాంధీని కలిసినవారందరూ ఎల్లో మీడియానేనా? అంటూ బండ్ల గణేష్ చురకలంటించారు. ఆచార్య హరగోపాల్, గద్దర్, ఆచార్య ఇటిక్యాల పురుషోత్తం, కంచె ఐలయ్య, చెరుకు సుధాకర్, జహీర్ ఆలీఖాన్‌లు రాహుల్‌ను కలిశారని, వారు కూడా ఎల్లో మీడియానేనా? అంటూ ప్రశ్నంచారు. ఇదిలా ఉండగా విజయసాయి ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రధాని మోదీపై అంత ప్రేమ ఉంటే బహిరంగంగా ప్రేమించుకోవచ్చుకదా.. ఈ తెరచాటు బాగోతమెందుకని కామెంట్స్ పెడుతున్నారు. మోదీని పదవి నుంచి దింపడానికి ఎవరో వ్యూహాలు పన్నుతుంటే విజయసాయి ఎందుకు కంగారు పడుతున్నారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


Read more