Home » Telangana
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మొద్దని, ఆ పార్టీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. సోమవారం బషీరాబాద్ మండలం రెడ్డిఘణాపూర్, మంతట్టి, కంసాన్పల్లి, పర్వత్పల్లి, మర్పల్లి, నీళ్లపల్లి, జలాల్పూర్, ఇస్మాయిల్పూర్, ఇందర్చెడ్, నవాంద్గీ, గంగ్వార్, క్యాద్గీరా, జీవన్గి గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి రంజిత్రెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు.
ఉమ్మడి జిల్లాలో నిప్పుల వర్షం కురుస్తోంది. సూర్యుడి భగభగలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. సోమవారం మండల పరిధిలోని మాల్లో సీఐ శంకర్కుమార్, ఎస్సైలు వెంకటనారాయణ, గోపాల్, సత్యనారాయణలు స్పెషల్పార్టీ పోలీసులతో కలిసి వాహనాలు తనిఖీ చేశారు. యాచారం వెళుతున్న వాహనాలతో పాటు మాల్కు వస్తున్న వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించారు.
రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను దేశించారు.
బైక్ అదుపుతప్పి కింద పడిపోవడంతో తీవ్రగాయాలపాలై ఓ యువకుడు మృతిచెందగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలైన ఘటన ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాగన్నగూడ వద్ద సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్షా ఈ నెల 9న భువనగిరికి రానున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా స్థానిక రా యిగిరిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు.
కులం పేరుతో దూషించిన వ్యక్తికి ఏడాది కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 5వేల జరిమానా విధిస్తూ ఎల్ బీనగర్ కోర్టు న్యాయాధికారి భవాని తీర్పు వెలువరించారు.
కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటనలపై భారీ ఆశలు పెట్టుకున్నాయి.
అనుమానం పెనుభూతమై.. భర్త కాలయముడై భార్యను అతి కిరాతకంగా చంపాడు. శంకర్పల్లి మండలం మిర్జాగూడ అనుబంధ గ్రామం ఇంద్రారెడ్డినగర్లో వడ్డె మాణిక్యం, యాదమ్మ దంపతులు కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు.
రాష్ట్రం లో ఉపాధ్యాయు ల పదోన్నతుల సంక్షోభానికి కారణమైన ఉపాధ్యా య అర్హత పరీక్ష (టెట్) వివాదం పై నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యాశాఖ కమిషనర్పై చర్యలు తీసుకోవాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి డిమాండ్ చేశారు.